కైరో రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం: 25 మంది మృతి

కైరో రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం: 25 మంది మృతి

ఈజిప్టు రాజధాని కైరోలో ఘోర ప్రమాదం జరిగింది. రామ్సెస్‌ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన రైలు.. ప్లాట్‌ఫాం గోడను ఢీకొట్టడంతో ఇంధనం ట్యాంకులో నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్లాట్ ఫాం పై రైలు రాక కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులంతా భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 25మంది ప్రాణాలు కోల్పోగా…మరో  50 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఫైరింజన్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.