రూ. 26.49 కోట్లతో పెద్దపల్లి రైల్వేస్టేషన్​ అభివృద్ధి

రూ. 26.49 కోట్లతో పెద్దపల్లి రైల్వేస్టేషన్​ అభివృద్ధి

పెద్దపల్లి, వెలుగు: అమృత్ భారత్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పథకంలో భాగంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్​ అభివృద్ధికి కేంద్రం రూ.26.49 కోట్లు కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం పెద్దపల్లి స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ వర్చువల్​గా ప్రారంభించారు. కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు.  రైల్వే అధికారులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

జమ్మికుంట, వెలుగు: కరీంనగర్​ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్–తనుగుల గ్రామాల మధ్య లో లెవెల్ బ్రిడ్జిని ప్రధాని మోదీ వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.4.5 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రామగుండం రీజనల్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గుప్తా, సంపత్ రావు, మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.