
ముంబై: గడిచిన రెండు రోజుల్లో 278 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకిందని మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం తెలిపారు. దీంతో రాష్ట్రంలోని పోలీసు సిబ్బందిలో మొత్తం కేసులు 1,666 కు పెరిగాయి. ఇందులో 473 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 16 మంది చనిపోయారు. కరోనా కాలంలో విధుల్లో ఉన్నప్పుడు 86 మంది పోలీసులు గాయపడ్డారని, లాక్డౌన్ కాలంలో పోలీసు సిబ్బందిపై దాడి కేసుల్లో 823 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఒక రిపోర్టులో పోలీస్ అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 41 మంది హెల్త్ సిబ్బందిపై దాడి జరిగింది. లాక్డౌన్ రూల్స్ పాటించనందుకు ఇప్పటివరకు మొత్తం 22,543 మందిని అరెస్టు చేశారు, 69,046 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు, నేరస్థుల నుంచి రూ .5,19,63,497 జరిమానాలు వసూలు చేశారు. రాష్ట్రంలో మొత్తం 41,642 కరోనా కేసులు నమోదు కాగా, 11,726 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 1,454 మంది చనిపోయారు.