ఒకే హాస్టల్​ లో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

ఒకే హాస్టల్​ లో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

రాజస్థాన్​లోని కోట నగరంలో మెడికల్​, ఇంజనీరింగ్​ ఎంట్రెన్స్​ లకు కోచింగ్​ తీసుకుంటున్న ముగ్గురు విద్యార్థులు హాస్టల్​ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరంతా 16 నుంచి 18 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. వీరిలో బీహార్ కు చెందిన ఇద్దరు స్టూడెంట్స్​ నీట్​ ఎంట్రెన్స్​ కు, మరో స్టూడెంట్​ మెడికల్​ ఎంట్రెన్స్​ కు ప్రిపేర్​ అవుతున్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురు ఒకే హాస్టల్​ లో ఉంటున్నారు. అయితే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన హాస్టల్​ గదుల్లో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్స్​ దొరకలేదు. నీట్​, మెడికల్​ ఎంట్రెన్స్​ లకు కోట నగరంలోని కోచింగ్​ సెంటర్లు ఎంతో ఫేమస్​. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్​ వచ్చి ఇక్కడ కోచింగ్​ తీసుకుంటుంటారు.