శేరిలింగంపల్లిలో ఒకే ఇంటి నంబర్ పై 3 లక్షల ఓటర్లు!

శేరిలింగంపల్లిలో ఒకే ఇంటి నంబర్ పై  3 లక్షల ఓటర్లు!

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: శేరిలింగంపల్లి సెగ్మెంట్ లో 3 లక్షల మంది ఓటర్లకు ఒకే ఇంటి నంబర్‌ నమోదైనట్లు వచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ఆదేశాల మేరకు  విచారణ చేస్తున్నట్టు రంగారెడ్డి కలెక్టర్ హరీశ్ తెలిపారు. వివిధ శివారు ప్రాంతాలు, వేర్వేరు పాత గ్రామ పంచాయతీలు జీహెచ్​ఎంసీలో విలీనమైన నేపథ్యంలో వాటికి సంబంధించిన ఇంటి నెంబర్లు ఒకే విధంగా నమోదైనట్లు ప్రాథమిక పరిశీలనలో తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.  

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు -చేర్పులు, అభ్యంతరాల స్వీకరణకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్లతో కూడిన 116 బృందాలు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల సహకారంతో 1,114 అపార్ట్ మెంట్లలో  ప్రత్యేక శిబిరాలు నిర్వహించాయన్నారు.