
సుప్రీంకోర్టుకు కొత్త నియమితులైన ముగ్గురు జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం (మే30)జడ్జీల చేత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయించారు.కర్ణాటక హైకోర్టు జడ్జీ ఎన్వీ అంజరియా, గౌహతి హైకోర్టు జడ్జి విజయ్ బిష్ణోయ్, బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ ఏఎష్ చందూర్కర్ గురువారం సుప్రీంకోర్టుకు నియమితులయ్యారు.
ఈ ముగ్గరు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో సహా 34 మంది న్యాయమూర్తులతో పూర్తిస్థాయి బెంచ్ తిరిగి బలాన్ని పొందుతుంది. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది జూన్ 9న పదవీవిరణమ చేయనున్నందున ఓ న్యాయమూర్తి పదవీ ఖాళీ కానుంది.
CJI నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం ముగ్గురు న్యాయమూర్తులను అత్యున్నత న్యాయస్థానానికి నియమించాలని సిఫార్సు చేసిన కొన్ని రోజుల తర్వాత మే 29న కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వారి నియామకాన్ని ప్రకటించారు.మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, హృషికేశ్ రాయ్ పదవీ విరమణ చేసిన తర్వాత సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న మూడు న్యాయమూర్తుల పదవులకు వీరి పేర్లు సిఫార్సు చేశారు.
ముగ్గురు కొత్త SC న్యాయమూర్తులు ఎవరు?
జస్టిస్ ఎన్.వి. అంజరియా : మార్చి 23, 1965న అహ్మదాబాద్లో జన్మించారు.జస్టిస్ ఎన్.వి. అంజరియా న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చారు. జస్టిస్ అంజరియా ఫిబ్రవరి 25, 2024న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు నవంబర్ 21, 2011న గుజరాత్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.సెప్టెంబర్ 6, 2013న శాశ్వత న్యాయమూర్తిగా స్థిరపడ్డారు.
జస్టిస్ అంజరియా అహ్మదాబాద్లోని హెచ్ఎల్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి పట్టా పొందారు.1988లో సర్ ఎల్ఎ షా లా కాలేజీ నుంచి ఎల్ఎల్బి పట్టా పొందారు. 1989లో అహ్మదాబాద్లోని యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని తీసుకున్నారు.1988 ఆగస్టులో గుజరాత్ హైకోర్టులో లా ప్రాక్టీస్ ప్రారంభించారు. రాజ్యాంగ సమస్యలు ,అన్ని వర్గాల సివిల్ కేసులు, కార్మిక ,సేవలకు సంబంధించి కేసుల టేకప్ చేశారు.
►ALSO READ | శత్రువు ఇంట్లోకెళ్లి దాడి చేశాం.. బ్రహ్మోస్ దెబ్బకు పాక్ ఆర్మీకి నిద్రలేని రాత్రులు:మోడీ
జస్టిస్ విజయ్ బిష్ణోయ్: మార్చి 26, 1964న జోధ్పూర్లో జన్మించిన జస్టిస్ బిష్ణోయ్.. జూలై 8, 1989న న్యాయవాదిగా చేరారు. రాజస్థాన్ హైకోర్టు ,జోధ్పూర్లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా..జస్టిస్ బిష్ణోయ్ ఫిబ్రవరి 5, 2024న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. జనవరి 8, 2013న రాజస్థాన్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు, జనవరి 7, 2015న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
జస్టిస్ ఎ.ఎస్. చందూర్కర్: 1965 ఏప్రిల్ 7న జన్మించిన జస్టిస్ ఎ.ఎస్. చందూర్కర్ పూణేలోని సెయింట్ విన్సెంట్స్ హై స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. పూణేలోని నెస్ వాడియా కళాశాల ,పూణేలోని ఐఎల్ఎస్ లా కళాశాల నుండి పట్టభద్రులయ్యారు.
జస్టిస్ ఎ.ఎస్. చందూర్కర్ 1988 జూలై 21న బార్లో చేరి ముంబైలో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1992లో నాగ్పూర్కు మారి వివిధ కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 2013 జూన్ 21న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.