క‌రోనా సోకిన వారిలో కొత్తగా మ‌రో మూడు ల‌క్ష‌ణాలు

క‌రోనా సోకిన వారిలో కొత్తగా మ‌రో మూడు ల‌క్ష‌ణాలు

ప్రకటించిన అమెరికా హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ

ఇప్ప‌టివ‌ర‌కూ క‌రోనా వైర‌స్ సోకిన వారిలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటివి లక్షణాలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి కొత్తగా మరో మూడు లక్షణాలు చేరాయి. అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన ఓ అధ్యయనంలో పై లక్షణాలే కాకుండా కొత్తగా మరో మూడింటిని గుర్తించారు. వాంతులు, విరేచనాలు మరియు ముక్కు కారటం కూడా కరోనా లక్షణాలే అని తేల్చారు. గొంతు మంట. అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటివి కూడా కరోనా లక్షణాలు అని ఈ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. ఈ లక్షణాలు వైరస్‌కు గురైన 2 నుంచి 14 రోజుల్లోగా కనిపిస్తాయని సంస్థ పేర్కొంది.