ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్ ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. బుడ్గామ్ లో గురువారం రాత్రి ఎన్ కౌంటర్ జరిగింది. జోల్వా క్రాల్ పొరాలో ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. పక్కా సమాచారంతోనే చదూరా ప్రాంతంలో సెర్చింగ్ నిర్వహించిన బలగాలు. టెర్రరిస్టుల ఇంటిని చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరిపారు. పరస్పర కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారని కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఘటనాస్థలంలో భారీగా మారణాయుధాలతో పాటు మూడు ఏకే 56 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు. ఉగ్రవాదులలో ఒకరిని శ్రీనగర్ కు చెందిన వసీమ్ గా గుర్తించారు.