హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో జియో కొత్తగా 3.27 లక్షల మంది సబ్స్క్రయిబర్లను సంపాదించుకుంది. మే 2022లో జియో ఈ కొత్త సబ్స్క్రయిబర్లను పొందినట్లు ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) డేటా తెలిపింది. ఇదే నెలకు భారతీ ఎయిర్టెల్ 71,312 మంది కొత్త మొబైల్ సబ్స్క్రయిబర్లను సాధించగా, వోడాఫోన్ 74,808 మంది, బీఎస్ఎన్ఎల్ 78,423 మంది సబ్స్క్రయిబర్లను పోగొట్లుకున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే మే నెలలో జియో 31.11 లక్షల కొత్త సబ్స్క్రయిబర్లను ఆకట్టుకుంది. దీంతో ఆ కంపెనీ మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య 40.87 కోట్లకు చేరింది. మే నెలలో 10.27 లక్షల మంది సబ్స్క్రయిబర్లను పొందిన భారతీ ఎయిర్టెల్ తన మొత్తం కస్టమర్ల సంఖ్యను 36.31 కోట్లకు పెంచుకోగలిగింది. మరోవైపు 7.5 లక్షల మందిని పోగొట్టుకున్న వోడాఫోన్ కస్టమర్లు 25.84 కోట్లకు తగ్గిపోయారు. 53.62 లక్షల మంది సబ్స్క్రయిబర్లను కోల్పోయిన బీఎస్ఎన్ఎల్ కూడా 11.28 కోట్ల కస్టమర్లతో సరిపెట్టుకుంది.
40 కోట్లు దాటిన జియో మొబైల్ కస్టమర్లు
- బిజినెస్
- July 20, 2022
లేటెస్ట్
- ఇంటర్ ఫెయిల్ అయ్యానని బిడ్డ ఆత్మహత్యాయత్నం..కూతురు దక్కదేమోనని తండ్రి సూసైడ్
- ఈడీ రైడ్స్: మంత్రి పీఏ, ఆయన పనిమనిషి అరెస్ట్
- లక్ష మందితో ప్రధాని మోదీ సభ
- ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి
- సబ్జైల్ను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి
- సూర్యాపేటలో అకాల వర్షాలతో ఆగమాగం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 13 మంది నామినేషన్
- ఆడపడుచులందరికీ అండగా ఉంటాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- ధాన్యం తడిసినా కొనుగోలు చేస్తాం : వెంకట్ రావు
- 108 వాహనంలో మహిళ డెలివరీ
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల