తమిళనాడులో 4 కోట్ల క్యాష్​ పట్టివేత

తమిళనాడులో 4 కోట్ల క్యాష్​ పట్టివేత
  • తమిళనాడులో 4 కోట్ల క్యాష్​ పట్టివేత
  • బీజేపీ అభ్యర్థికి చెందిన సొమ్మేనని అనుమానాలు

చెన్నై : తమిళనాడులో అక్రమంగా తరలిస్తు న్న రూ. 4 కోట్ల క్యాష్​ను ఆదివారం అధికారులు పట్టుకున్నారు. బీజేపీ అభ్యర్థి అనుచరు లుగా అనుమానిస్తున్న ముగ్గురి నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నా రు. ‘‘ముగ్గురు వ్యక్తులు ఎగ్మోర్​ నుంచి రైల్లో తిరునల్వేలికి వెళ్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్​ బృందం వారిని చేజ్ చేసింది. తాంబరం వద్ద అడ్డగించి సోదాలు చేయ గా వారి లగేజీల్లో క్యాష్​ కనిపించింది.

ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అధికా రులు సీజ్ చేశారు. ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు” అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) తెలిపారు. ఘటనపై ఇన్​కం ట్యాక్స్ డిపార్ట్​మెంట్ సమగ్ర దర్యాప్తు ప్రారంభిస్తుందన్నా రు. ఈ ముగ్గురూ తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నైనార్ నాగేంద్రన్ మద్దతుదారుల ని పోలీసులు అనుమానిస్తున్నారు. 

కాగా, నాగేంద్రన్​పై చర్యలు తీసుకోవాలంటూ సీఈవోకు డీఎంకే ఫిర్యాదు చేసింది. ఓటర్లకు డబ్బులు పంచేందుకు నాగేంద్రన్ ప్లాన్ చేశారని ఆరోపించింది. అయితే, ఇదంతా తన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమని నాగేంద్రన్ మండిపడ్డారు.