ట్రైన్ వాష్రూంలో బాలిక కాలు ఇరుక్కుపోవడంతో ఆమె నరకయాతన అనుభవించిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్లోని సీతామర్హికి చెందిన మహ్మద్అలీ తన భార్య, కుమార్తెతో కలిసి ఆగ్రా పోర్ట్ స్టేషన్లో అవధ్ఎక్స్ప్రెస్ ఏసీ బోగీ ఎక్కారు. కుమార్తెను టాయిలెట్కి తీసుకెళ్లారు.
ట్రైన్ స్పీడ్కి బోగీ కదలడంతో పాప కాలు టాయిలెట్బేసిన్లో ఇరుక్కుపోయిందని. ఆమె పేరెంట్స్, ప్యాసింజర్లు కాలుని బయటకు తీయాలని ప్రయత్నించినా రాలేదు. ట్రైన్ 20 కి.మీ. ల దూరంలోని ఫతేపుర్సిక్రీ చేరుకున్నాక అక్కడి అధికారులు పాప కాలును బయటకి తీశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.