ట్రైన్​ టాయిలెట్ లో ఇరుక్కుపోయిన బాలిక కాలు

ట్రైన్​ టాయిలెట్ లో ఇరుక్కుపోయిన బాలిక కాలు

ట్రైన్ వాష్​రూంలో బాలిక కాలు ఇరుక్కుపోవడంతో ఆమె నరకయాతన అనుభవించిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్​లోని సీతామర్హికి చెందిన మహ్మద్​అలీ తన భార్య, కుమార్తెతో కలిసి ఆగ్రా పోర్ట్​ స్టేషన్​లో అవధ్​ఎక్స్​ప్రెస్​ ఏసీ బోగీ ఎక్కారు. కుమార్తెను టాయిలెట్​కి తీసుకెళ్లారు. 

ట్రైన్ స్పీడ్​కి బోగీ కదలడంతో పాప కాలు టాయిలెట్​బేసిన్​లో ఇరుక్కుపోయిందని. ఆమె పేరెంట్స్, ప్యాసింజర్లు​ కాలుని బయటకు తీయాలని ప్రయత్నించినా రాలేదు. ట్రైన్​ 20 కి.మీ. ల  దూరంలోని ఫతేపుర్​సిక్రీ చేరుకున్నాక అక్కడి అధికారులు పాప కాలును బయటకి తీశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.