
ఫనోమ్పెన్హ్ (కంబోడియా): మొసలి గుడ్లను ఎన్ క్లోజర్ నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని 40 మొసళ్లు దాడి చేసి చంపేశాయి. ఈ ఘటన కంబోడియాలోని ఫనోమ్ పెన్హ్లో శుక్రవారం జరిగింది. 72 ఏళ్ల వ్యక్తి ఎన్ క్లోజర్లోని మొసలి గుడ్లను బయటకు తీసే క్రమంలో గుడ్ల దగ్గర ఉన్న మొసలిని బయటకు పంపేందుకు కర్రతో పొడిచాడు. కర్రను మొసలి నోటితో లాగడంతో ఎన్క్లోజర్లో పడిపోయాడు. దీంతో 40 మొసళ్ల గుంపు ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. బాధితుడి శరీరాన్ని చీల్చేయడంతో ఎన్క్లోజర్ రక్తంతో తడిచిందని పోలీసులు తెలిపారు.
మొసళ్లు తినేయగా మిగిలిన శరీరాన్ని బయటకు తీశామని వెల్లడించారు. మృతుడి చేతుల్లో ఒకదాన్ని మొసళ్లు కొరికి మింగేశాయన్నారు. అంగర్కోట్ గేట్ వే అనే ఈ ప్రాంతంలో చాలా మొసళ్ల ఫామ్లు ఉన్నాయి. గుడ్లు, చర్మం, మాంసంతోపాటు యుక్తవయస్సులో ఉన్న మొసళ్లను విక్రయించేందుకు రెప్టైల్ఫామ్లు ఏర్పాటు చేస్తారు. కాగా, 2019లో రెండేళ్ల బాలికను మొసళ్లు చంపి తినేశాయి. బాలిక కుటుంబానికి సంబంధించిన మొసళ్ల ఫామ్లో ఈ ఘటన చోటుచేసుకుంది.