
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలో పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఊరు మందమర్రికి వెళ్లే మార్గంలోని మినీ ట్యాంక్బండ్వద్ద పోలీసులు శుక్రవారం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో బైక్పై వెళ్తున్న మందమర్రి మండలం బురదగూడెంకు చెందిన మువ్వ గౌతమ్, ముండ్రు మణి అనుమానాస్పదంగా కనిపించారు.
వారిని ఆపి, తనిఖీ చేయగా రూ.లక్ష విలువైన 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. విత్తనాలను ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నారు. ఏవో కిరణ్మయి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి, గౌతమ్, మణిని అరెస్ట్చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్సై మల్లేశ్, కానిస్టేబుళ్లను సీఐ శశిధర్రెడ్డి అభినందించారు.