అహ్మదాబాద్ మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ (ఏఎంటీఎస్)లో పనిచేస్తున్న 51 ఏళ్ల బస్ కండక్టర్ రాకేష్ బ్రహ్మ్భట్పై జుహాపురాకు చెందిన 40 ఏళ్ల ఇద్దరు పిల్లల తల్లి మెహజాబిన్ చువారా యాసిడ్ దాడి చేసింది. కాలుపూర్ పోలీసులకు దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, ఈ సంఘటన జనవరి 27న రాత్రి జరిగింది. వారి ఎనిమిదేళ్ల బంధం ముగియడంతో చువారా కోపంతో ఈ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న తెలుస్తోంది.
బాపునగర్లోని ఎవరెస్ట్ సొసైటీలో నివసిస్తున్న బ్రహ్మభట్, మొదట AMTS బస్సులో చువరాను కలిశాడు. వారి స్నేహం ఎనిమిదేళ్ల పాటు శృంగార సంబంధంగా సాగింది. అయితే, అతని భార్యకు ఆ విషయంతో తెలియడంతో బ్రహ్మభట్ ఆ సంబంధాన్ని ముగించాల్సి వచ్చింది. దీంతో చువారాకు దూరంగా పెట్టాడు. ఈ క్రమంలో కోపం పెంచుకున్న చువారా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా.. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న కంట్రోల్ క్యాబిన్లో బ్రహ్మభట్ ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన చువారా.. యాసిడ్ దాడి చేసినట్టు పలు నివేదికలు సూచిస్తున్నాయి.
దాడి వల్ల బ్రహ్మభట్ ముఖం, వీపు, ప్రైవేట్ భాగాలపై కాలిన గాయాలయ్యాయి. చువారా ప్లాస్టిక్ డబ్బా నుండి అతనిపై యాసిడ్ పోయడానికి ముందు సంబంధాన్ని ముగించాలని బ్రహ్మభట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించింది. అతని అరుపులకు స్పందించించిన స్థానికులు.. అమ్దుపురాలోని జీసీఎస్ ఆసుపత్రికి తరలించారు. బ్రహ్మభట్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో.. మిత్ శర్మ అనే వ్యక్తిని చువారా సహచరుడిగా పేర్కొన్నాడు. శర్మ ఆమెకు డబ్బాను ఇచ్చాడని పేర్కొన్నాడు. అయితే, నేరం జరిగినప్పుడు నేరం జరిగిన ప్రదేశంలో శర్మ ఉన్నట్లు నిర్ధారించడానికి ఎటువంటి ఆధారాలు లేవని పోలీసు అధికారులు పేర్కొన్నారు. శర్మ.. చువారా ఫేస్బుక్ ఫ్రెండ్ అని, అతని సెల్ ఫోన్ లొకేషన్ మాత్రం అతని ప్రమేయానికి విరుద్ధంగా ఉన్నట్లు నమోదైంది.
విడిపోవడాన్ని అవమానంగా భావించి చువారా యాసిడ్ దాడికి పాల్పడినట్టు సమాచారం. దీంతో చువరాను ఇన్స్పెక్టర్ ఎస్ఏ కర్మూర్ నేతృత్వంలోని కలుపూర్ పోలీసులు అరెస్టు చేశారు. లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం వ్యక్తిపై యాసిడ్ పోసి తీవ్రంగా గాయపరిచినట్టు చువారా అభియోగాలు ఎదుర్కొంటోంది.