
న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. 4,273 కొత్త కేసులు రికార్డయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన హయ్యెస్ట్ కేసులివి. మొత్తంగా 67,138 కేసులు రికార్డయ్యాయి. ఆదివారం 111 మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 2,212కి పెరిగింది. 20,969 మంది కోలుకున్నారు. 43,953 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలోనూ ఒక్కరోజు నమోదైన కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. 1,943 కేసులు ఆదివారం రిపోర్ట్ అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 22,171కి చేరింది. 832 మంది చనిపోయారు. కరోనా కేసుల్లో ఢిల్లీని తమిళనాడు దాటింది. మూడో ప్లేస్కు వచ్చింది. ఆ రాష్ట్రంలో ఆదివారం 669 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 7,204కి చేరింది. 47 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 41,52,784 మంది కరోనా బారిన పడ్డారు. 2,82,658 మంది చనిపోయారు.