ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి అస్వస్థత

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి అస్వస్థత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 44మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని జూలూరుపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. విద్యార్థినులు కిచిడీ తిని అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం కొద్దిమంది విద్యార్థులకు వాంతులు అవ్వగా, ఇవాళ ఉదయం మరికొంతమంది అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. 

గత కొన్నిరోజులుగా ఆశ్రమ పాఠశాలలో వర్కర్లు సమ్మె చేస్తున్నారు. దీంతో విద్యార్థినులకు భోజన సమస్య ఏర్పడింది. స్థానిక తహశీల్దార్ లూథర్ విల్సన్ ఆస్పత్రికి చేరుకొని ఘటనపై విచారణ చేపట్టారు.