న్యూఢిల్లీ: నిఫ్టీ 500 ఇండెక్స్లోని 48 షేర్లు ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చి పెట్టాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 150 ఇండెక్స్లోని 12 షేర్లు, నిఫ్టీ 250 లోని 32 షేర్లు రెండు రెట్లు కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చాయి. మల్టీ బ్యాగర్ రిటర్న్ ఇచ్చిన షేర్లు క్యాపిటల్ గూడ్స్ (12 షేర్లు), ఫైనాన్షియల్ సర్వీసెస్ (8 ), ఐటీ (5) సెక్టార్లలో ఎక్కువగా ఉన్నాయి. లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో జొమాటో, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ 2023లో ఇన్వెస్టర్లకు మంచి లాభాలిచ్చాయి.
జొమాటో షేరు 2022 లో 60 శాతం పడిపోగా, 2023లో రెండున్నర రెట్లు పెరిగింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్) షేర్లు 2.4 రెట్లు పెరిగాయి. కంపెనీ ఆర్డర్ బుక్ పెరగడం, పనులు వేగంగా జరుగుతుండడంతో ఈ షేరు వెంట ఇన్వెస్టర్లు పడ్డారు. మిడ్క్యాప్ సెగ్మెంట్లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసీ షేర్లు 3.5 రెట్లు లాభపడ్డాయి.
స్మాల్క్యాప్ సెగ్మెంట్లో బీఎస్ఈ లిమిటెడ్ 4 రెట్లు, సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 3.6 రెట్లు, అపర్ ఇండస్ట్రీస్ షేర్లు 3.2 రెట్లు ఎగశాయి. 2023 లో రైల్వే షేర్లు దుమ్ము లేపాయి. జూపిటర్ వ్యాగన్స్, ఐఆర్ఎఫ్సీ, ఐఆర్సీఓఎన్, రామ్కృష్ణ ఫోర్జింగ్స్, టెక్స్మాకో రైల్ షేర్లు 3 రెట్లు, ఆర్వీఎన్ఎల్, రైల్టెల్ కార్ప్, తీతాగఢ్ రైల్ రెండు రెట్లు లాభపడ్డాయి. ఇతర కంపెనీల్లో జై బాలాజీ షేర్లు 13 రెట్లు పెరిగాయి. కేన్స్ టెక్నాలజీస్ 3.5 రెట్లు లాభపడింది.