
ప్రపంచంలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల మూడు వేల మందికి పైగా చనిపోయారు. కరోనా వైరస్ దెబ్బకు అన్ని దేశాల ఆర్థికస్థితులు తలకిందులవుతున్నాయి. ఆయా దేశాల ఎకానమీ కూడా దెబ్బతింటోంది. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగలకు వర్క్ ఫ్రం హోమ్ ఆఫర్ ఇచ్చి పని చేయించుకుంటున్నాయి. కాగా.. ఓయో మాత్రం తన కంపెనీలో పనిచేసే 5 వేల మందిని తీసేయాలని నిర్ణయం తీసుకుంది. ఓయోకు ప్రపంచవ్యాప్తంగా 30 వేల మంది ఉద్యోగులున్నారు. వారిలోనుంచి 5వేల మంది ఇప్పుడు తీసేస్తుంది. అందులో ఎక్కువగా చైనాలో పనిచేసే వారే ఉన్నారు. ఓయో జనవరిలోనే తమ గ్లోబల్ ఉద్యోగులను 17 శాతం వరకు తగ్గిస్తామని ప్రకటించింది.