పీఎఫ్ విత్ డ్రా కు 50 వేల దరఖాస్తులు

పీఎఫ్ విత్ డ్రా కు 50 వేల దరఖాస్తులు

కరోనా వైరస్ కారణంగా ఉద్యోగులు, కార్మికులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన కేంద్రం ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాల నుంచి  కొంత సొమ్మును విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల నుంచి 75 శాతం లేదంటే, మూడు నెలల మూల వేతనం.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానిని తీసుకోవచ్చని ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ఈపీఎఫ్‌వో చట్టంలో మార్పులు చేసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో పనుల్లేక… సరిగా జీతాలు అందక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు. 50 వేల మందికి పైగా పీఎఫ్ విత్ డ్రా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు హైదరాబాద్‌లోని ఈపీఎఫ్‌వో వర్గాలు తెలిపాయి. తెలంగాణ రీజియన్ పరిధిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు మూడు నుంచి ఏడు రోజుల్లోనే పరిష్కరించినట్లు తెలిపారు.