
దహెగాం, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 54 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ ను ఎన్ఫోర్స్మెంట్అధికారులు పట్టుకున్నారు. దహెగాం తహసీల్దార్ మునావర్ షరీఫ్ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రంలోని వాసవి మోడ్రన్ రైస్ మిల్లో పీడీఎస్ రైస్ రీసైక్లింగ్చేస్తున్నట్టు ఎన్ఫోర్స్మెంట్అధికారులకు సమాచారం అందింది. నిఘా పెట్టి మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం నుంచి వాహనాన్ని ఫాలో చేస్తూ వచ్చి రైస్ మిల్ లో దాడి చేశారు.
వాహనంలో నుంచి పీడీఎస్ రైస్ అన్లోడ్ చేస్తుండగా పట్టుకున్నారు. మిల్ ఆవరణలోని రేకుల షెడ్డులో కూడా నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిల్లు ఓనర్ సూర సందీప్తో పాటు డ్రైవర్ మానెపల్లి అభిషేక్, బియ్యం సప్లై చేసిన కన్నెపల్లి మండలానికి చెందిన గుల్బం రాకేశ్, గుమస్తా విఘ్నేశ్పై కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. రైస్ మిల్ను సీజ్ చేసినట్టు చెప్పారు.