ఏపీలో కొత్త‌గా 551 పాజిటివ్ కేసులు

ఏపీలో  కొత్త‌గా 551 పాజిటివ్ కేసులు

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 551 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,72,839కి చేరింది. సోమ‌వారం ఒక్కరోజే కరోనా కారణంగా నలుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 7,042కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,429కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 744 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,60,368కి చేరింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 108 కొత్త కేసులు రాగా.. గుంటూరు జిల్లాలో 89, చిత్తూరు జిల్లాలో 76, పశ్చిమ గోదావరి జిల్లాలో 58, తూర్పు గోదావరి జిల్లాలో 57 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 5, విజయనగరం జిల్లాలో 11 కేసులు న‌మోద‌య్యాయి.