జార్జియాలో మమ్మల్ని పశువుల్లా చూశారు..ఇన్స్టాలో బాధితురాలి పోస్ట్ వైరల్

జార్జియాలో మమ్మల్ని పశువుల్లా చూశారు..ఇన్స్టాలో బాధితురాలి పోస్ట్ వైరల్
  • ప్రధాని మోదీకి ట్యాగ్​

న్యూఢిల్లీ: జార్జియా టూర్​కు వెళ్లిన 56 మంది భారతీయులను అక్కడి అధికారులు పశువుల్లా చూశారని.. తిండి లేదని, బాత్రూం పోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదని బాధితుల్లో ఒకరైన ధ్రువీ పటేల్​ అనే మహిళ బుధవారం ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ పెట్టారు. 

వ్యాలీడ్​ వీసా సహా అన్ని డాక్యుమెంట్లతో తాము అక్కడికి వెళ్తే.. క్రిమినల్స్​ను ట్రీట్​ చేసినట్లు ఆఫీసర్లు ప్రవర్తించారని ఆవేదన వెలిబుచ్చారు. తాము ఆర్మేనియాను దాటి జార్జియాలోకి ప్రవేశిస్తుంటే.. అధికారులు తనిఖీల పేరిట తమను చిత్ర వధకు గురిచేశారని ధ్రువీ పటేల్​ పేర్కొన్నారు. 

గడ్డకట్టే చలిలో గంటల తరబడి రోడ్డుపై కూర్చోబెట్టారని కన్నీళ్లు పెట్టుకున్నారు. క్రిమినల్స్​ను తీసినట్లుగా తమను వీడియో తీసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ పోస్ట్​ను ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్​కు ధ్రువీ పటేల్​ ట్యాగ్​ చేశారు. ఘటనపై భారత ప్రభుత్వం గట్టిగా బదులివ్వాలని ఆమె కోరారు.