
కరోనాతో విలవిలలాడుతున్న అమెరికాను భారీ భూకంపం మరింత భయపెట్టింది. ఇదాహో రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూకంపం సంభవించిందని…దీని తీవ్రత 6.5 గా ఉందని ఇవాళ నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించింది. నిన్న(మంగళవారం) సాయంత్రం 20-30 సెకన్ల పాటు భూమి కంపించిందని… బోయిస్ ఈశాన్యంగా ఈ భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో భయంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. కొంతమంది ఇంట్లో వస్తువులు కదులుతుండగా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
#Earthquake in #lockdown times … ? #IdahoEarthquake https://t.co/LlfOMFPnev
— Manuel Sintubin ⚒️ (@ManuelSintubin) April 1, 2020