అమెరికాలో భూకంపం…తీవ్రత 6.5

అమెరికాలో భూకంపం…తీవ్రత 6.5

కరోనాతో విలవిలలాడుతున్న అమెరికాను భారీ భూకంపం మరింత భయపెట్టింది. ఇదాహో రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూకంపం సంభవించిందని…దీని తీవ్రత 6.5 గా ఉందని  ఇవాళ నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ ప్రకటించింది. నిన్న(మంగళవారం) సాయంత్రం 20-30 సెకన్‌ల పాటు భూమి కంపించిందని… బోయిస్‌ ఈశాన్యంగా ఈ భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో భయంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. కొంతమంది ఇంట్లో వస్తువులు కదులుతుండగా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.