కారులో చిక్కుకున్న ముగ్గురు చిన్నారులు.. ఒకరి మృతి

కారులో చిక్కుకున్న ముగ్గురు చిన్నారులు.. ఒకరి మృతి

ఒక్కోసారి సరదాగా చేసే పనులకు కూడా ప్రాణాలు పోతాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన ఉత్తర్‌‌ప్రదేశ్‌‌లోని కొత్వాలీ దతాగంజ్‌లో జరిగింది. ఓ ఆరేళ్ల పిల్లాడు తన కజిన్స్‌‌తో కలసి కారులో సరదాగా ఆడుకుంటూ ఉండగా అనుకోకుండా డోర్ లాక్ అయ్యింది. కొద్దిసేపటికి ఊపిరాడకపోవడంతో చిన్నారులు కార్ డోర్‌‌లు తీయడానికి యత్నించారు. కానీ అవి తెరుచుకోలేదు. దీంతో ముగ్గురు పిల్లలు స్పృహ కోల్పోయారు. ఈ విషయాన్ని గుర్తించిన పేరెంట్స్.. పిల్లల్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ముగ్గురు చిన్నారులను అసిఫా (3), మంతాషా (5), పప్పూ (6)గా గుర్తించారు. వీరిలో పప్పూ చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందన్నారు. అసిఫా, మంతాషాకు జిల్లా ఆస్పత్రిలో ట్రీట్‌‌మెంట్ అందిస్తున్నారు.