రైతులు చనిపోతున్నా ప్రభుత్వం స్పందించదా..?

రైతులు చనిపోతున్నా ప్రభుత్వం స్పందించదా..?

మేఘాలయ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నఉద్యమంలో 600 మందికి పైగా చనిపోయారని... అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని మండిపడ్డారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. జంతువులు చనిపోతేనే గోల చేసే ఢిల్లీ నేతలు... చనిపోయిన రైతులకు లోక్ సభలో సంతాపం తెలపలేరా..? అని ప్రశ్నించారు. గవర్నర్ పదవి నుంచి దిగిపోమ్మని ఢిల్లీ నేతలు చెబితే అలానే చేస్తానని స్పష్టం చేశారు సత్యపాల్ మాలిక్.