న్యూఢిల్లీ: కన్సల్టింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఐఐఎం బెంగళూరు స్టూడెంట్లకు భారీగానే ఉద్యోగాలు ఇచ్చాయి. 2021–-23 బ్యాచ్కు చెందిన512 మంది పీజీపీ, పీజీపీబీఏ స్టూడెంట్లకు 606 ఆఫర్స్ అందించాయి. యాక్సెంచర్ నాయకత్వంలోని కన్సల్టింగ్ కంపెనీలు 221 ఆఫర్స్ అందజేశాయి. యాక్సెంచర్ 32 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ 26 ఆఫర్లతో తర్వాతి స్థానంలో ఉంది. బెయిన్ & కంపెనీ (23), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (18), మెకిన్సే & కంపెనీ (16), కెర్నీ (15), ఎర్నెస్ట్ & యంగ్ (13), ప్రైస్వాటర్ హౌస్ కూపర్స్ (11), అల్వారెజ్ & మార్సల్, ఆలివర్ వైమాన్, డెలాయిట్ మానిటర్, డెలాయిట్ వంటివి తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మెజారిటీ స్టూడెంట్లు స్ట్రాటజీ కన్సల్టింగ్ జాబ్స్ను కోరుకున్నారు. మరికొందరు జనరల్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ వైపు ఆసక్తి చూపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డొమైన్లో 85 ఆఫర్లు ఉన్నాయి. ఈ జాబ్స్ ఇచ్చిన కంపెనీల్లో పేటీఎం (13), మైక్రోసాఫ్ట్ (10), కోజోపోర్ట్, జియో ప్లాట్ఫారమ్, నాట్వెస్ట్ గ్రూప్, సిస్కో మొదలైనవి ఉన్నాయి. ఈ-–కామర్స్ స్పేస్లో అమెజాన్ (14) ఫ్లిప్కార్ట్ (8)లు 22 ఆఫర్స్ ఇచ్చాయి. ఫైనాన్స్ డొమైన్లో 75 ఆఫర్లు ఉన్నాయి.
బ్యాంకుల్లో గోల్డ్మన్ శాక్స్ 8 ఆఫర్లను అందించగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆరుగురికి అవకాశం ఇచ్చింది. ఇతర రిక్రూటర్లలో అవెండస్ క్యాపిటల్, సిటీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఉన్నాయి. కొన్ని గ్రూప్స్ జనరల్ మేనేజ్మెంట్ స్థానాల కోసం 86 ఆఫర్లను ఇచ్చాయి. అదానీ, వేదాంత ఒక్కొక్కటి ఎనిమిది చొప్పున ఆఫర్స్ ఇచ్చాయి. లోధా గ్రూప్ ఏడుగురికి అవకాశం ఇచ్చింది. సేల్స్, మార్కెటింగ్ విభాగంలో 67 స్టూడెంట్లు ఆఫర్లను అందుకున్నారు. ఈ జాబ్స్ఇచ్చిన వాటిలో ఏషియన్ పెయింట్స్ (8), శామ్సంగ్ ఇండియా (5), నవీ (4), నెస్లే (4), ఐటీసీ (3), మోండెలెజ్ ఇంటర్నేషనల్ (4) , ప్రోక్టర్ & గాంబుల్ (3) వంటి కంపెనీలు ఉన్నాయి. ఆపరేషనల్ రోల్స్ కోసం కోగోపోర్ట్ (5), ఓలా ఎలక్ట్రిక్ (3), ఉబర్ (3) వంటి కంపెనీలు 15 మందికి అవకాశాలు ఇచ్చాయి. ఎనలిటిక్స్ రంగం మొత్తం 35 ఆఫర్లను ఇచ్చింది. అమెరికన్ ఎక్స్ప్రెస్ 16 ఆఫర్లతో ముందుంది. తర్వాత స్థానంలో ఈఎక్స్ఎల్ సర్వీసెస్ (9) ఉంది. ఐఎంబీ కెరీర్ డెవలప్మెంట్ సర్వీసెస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ దేవలీనా దత్తా మాట్లాడుతూ మార్కెట్లో స్లోడౌన్ ఉన్నప్పటికీ తమ స్టూడెంట్లు పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లను అందుకున్నారని చెప్పారు.