దేశంలో ఒక్కరోజే 64,531 కేసులు..1092 మరణాలు

దేశంలో ఒక్కరోజే 64,531 కేసులు..1092 మరణాలు

దేశంలో  కరోనా విలయతాండవం చూపిస్తుంది.గడిచిన 24 గంటల్లో  కొత్తగా 64,531 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 27,67,274 కు చేరింది. నిన్న ఒక్కరోజే మరో 1092 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 52,889 కు చేరింది. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి 20,37,871 మంది కోలుకున్నారు. ఇంకా 6,76,514 మంది చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక నిన్న ఒక్కరోజే  8,01,518 టెస్టులు చేశారు. వీటితో కలిపి దేశంలో కరోనా టెస్టుల సంఖ్య ఆగస్టు 18 వరకు 3,17,42,782 కు చేరిందని ఐసీఎంఆర్ వెల్లడించింది.