ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ మరో బిగ్ ఫైట్ జరుగుతుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఢిల్లీ, పంజాబ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. నిన్న రాజస్థాన్ చేతిలో లక్నో ఓడిపోవడంతో.. ప్లేఆఫ్స్ ఈక్వేషన్స్ రసవత్తరంగా మారాయి. గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోగా మిగిలిన మూడు స్దానాల కోసం ఆరు జట్ల (రాజస్థాన్, లక్నో, ఆర్సీబీ, ఢిల్లీ, కేకేఆర్, పంజాబ్) మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. దీంతో ఇవాళ్టి మ్యాచ్ 2 టీమ్స్ కి కీలకంగా మారింది.
పంజాబ్, ఢిల్లీ జట్లు ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో చెరి 12 పాయింట్లు (12 మ్యాచ్ల్లో 6 విజయాలు) సాధించి పాయింట్ల పట్టికలో సమంగా ఉన్నాయి. అయితే పంజాబ్ (0.023)తో పోలిస్తే.. ఢిల్లీ (0.210) నెట్ రన్రేట్ కాస్త మెరుగ్గా ఉండటంతో ఆ జట్టు ఐదో స్థానంలో, పంజాబ్ ఏడో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు మరింత చేరువ అవుతుంది.
టీమ్స్
A look at the Playing XI for #PBKSvDC
— IndianPremierLeague (@IPL) May 16, 2022
Live - https://t.co/twuPEouUzK #PBKSvDC #TATAIPL https://t.co/hnxRmUFeL9 pic.twitter.com/5Xc0M0htxw