దేశంలో కొత్తగా 6977 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 6977 కరోనా కేసులు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6 997 కరోనా పాజీటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద మెత్తంలో కేసులు నమోదు కావటం ఇదే మెదటిసారని.. 24 గంటల్లో దేశంలో కరోనాతో 154 మంది చనిపోయారని చెప్పింది. దేశంలో మెత్తం కేసుల సంఖ్య 1,38,845కి చేరిందని ..యాక్టివ్ కేసులు 77103 ఉండగా.. వైరస్ నుంచి  57720 మంది కోలుకున్నారని కేంద్రం ప్రకటించింది. ఇప్పటి వరకు దేశంలో చనిపోయిన వారి సంఖ్య 4021కి చేరిందని..కరోనా రికవరీ రేటు 41.57శాతం ఉండగా.. డెత్ రేటు 2.89గా ఉందని తెలిపింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ.

For More News..

ఇంటి నుంచి పనిచేయడానికే ఇష్టపడుతున్నరు

కూలీల తరలింపునకు 13 కోట్లు ఖర్చుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

విదేశాల్లో దూసుకుపోతున్న ఇండియన్ ఓటీటీలు