దొంగ‌కి క‌రోనా.. క్వారంటైన్ లోకి ఏడుగురు పోలీసులు, ఒక జ‌డ్జి

దొంగ‌కి క‌రోనా.. క్వారంటైన్ లోకి ఏడుగురు పోలీసులు, ఒక జ‌డ్జి

ఒక దొంగ క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ప‌ది మంది క్వారంటైన్ లోకి వెళ్లాల్సి వ‌చ్చింది. అందులో ఏడుగురు పోలీసులు, ఒక జ‌డ్జితో పాటు ఇద్ద‌రు సామాన్యులు ఉన్నారు. ఇంకా ఆ దొంగ ఎక్క‌డెక్క‌డ తిరిగాడనే స‌మాచారం రాబ‌ట్టాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ఘ‌ట‌న‌ పంజాబ్ లోని లుధియానాలో జ‌రిగింది.

జ‌డ్జి ఎదుట గ‌ట్టిగా ద‌గ్గి… టెస్ట్ టైమ్ లో ఒక దొంగ ప‌రార్

లుధియానా న‌గ‌రంలోని ఓ ప్రాంతంలో ఇద్ద‌రు దొంగ‌లు చోరీకి ప్ర‌య‌త్నించారు. అయితే వారిని స్థానికులు ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. వారిని పోలీసులు జ‌డ్జి మోనికా సింగ్ ఎదుట ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు ఆ ఇద్ద‌రూ గ‌ట్టిగా ద‌గ్గారు. దీంతో వారికి వైద్య ప‌రీక్ష‌లు చేయించాల‌ని ఆదేశించారు న్యాయ‌మూర్తి. ఆ ఇద్ద‌రిని క‌రోనా టెస్టుల కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు పోలీసులు. అక్క‌డ టెస్టులు చేసే స‌మ‌యంలో ఒక దొంగ ప‌రార‌య్యాడు. రెండో దొంగ‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అత‌డిని ఐసోలేష‌న్ వార్డుకు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ దొంగ‌ల‌ను ప‌ట్టించిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌తో పాటు వారిని అదుపులోకి తీసుకుని, ద‌ర్యాప్తు చేసిన‌ ఏడుగురు పోలీసు సిబ్బంది, జ‌డ్జిని క్వారంటైన్ చేసిన‌ట్లు తెలిపారు పోలీసు ఉన్న‌తాధికారులు. ప‌రారైన దొంగ‌ను ప‌ట్టుకునేందుకు గాలింపు సాగిస్తున్న‌ట్లు చెప్పారు.