
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఘోరం జరిగింది.. ఆదివారం ( జులై 27 ) హరిద్వార్ లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... శ్రావణమాసం కావడంతో ఆదివారం పెద్ద ఎత్తున యాత్రికులు ఆలయానికి పోటెత్తారు. భారీగా చేరుకున్న యాత్రికులు క్యూలైన్లలో బారులు తీరారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోవడంతో పలువురు భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది.
ఘటనపై సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Haridwar, Uttarakhand | The injured are being rushed to the hospital following a stampede at the Mansa Devi temple. 6 people died and several others got injured in the stampede. pic.twitter.com/ScUaYyq2Z3
— ANI (@ANI) July 27, 2025
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎక్స్ వేదికగా స్పందించారు. ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, ఇతర సహాయక బృందాలు ఘటనాస్థలం దగ్గర సహాయక చర్యలు చపట్టాయని... స్థానిక యంత్రాంగంతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు పుష్కర్ సింగ్ ధామి.
हरिद्वार स्थित मनसा देवी मंदिर मार्ग में भगदड़ मचने का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ है। @uksdrf, स्थानीय पुलिस तथा अन्य बचाव दल मौके पर पहुंचकर राहत एवं बचाव कार्यों में जुटे हुए हैं।
— Pushkar Singh Dhami (@pushkardhami) July 27, 2025
इस संबंध में निरंतर स्थानीय प्रशासन के संपर्क में हूं और स्थिति पर लगातार निगरानी रखी जा रही…