బీహార్​లో ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలో ఏడుగురు మృతి

బీహార్​లో ఘోర ప్రమాదం..  ఒకే ఫ్యామిలీలో  ఏడుగురు మృతి

ససారం: బీహార్​లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగిఉన్న ట్రక్కును కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోహ్​తాస్ జిల్లా శివసాగర్​ఏరియాలో నేషనల్​ హైవే 2పై బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ యాక్సిడెంట్​ జరిగింది.

బాధితులను కైమూర్​ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. జార్ఖండ్​లోని రాజ్రప్ప టెంపుల్​కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు కారులో 11 మంది ఉన్నారు.  ఓవర్​స్పీడ్​ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.