ససారం: బీహార్లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగిఉన్న ట్రక్కును కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోహ్తాస్ జిల్లా శివసాగర్ఏరియాలో నేషనల్ హైవే 2పై బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది.
బాధితులను కైమూర్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. జార్ఖండ్లోని రాజ్రప్ప టెంపుల్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు కారులో 11 మంది ఉన్నారు. ఓవర్స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.