ముగ్గురు మృతి: ఏడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ

ముగ్గురు మృతి: ఏడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ

మహారాష్ట్ర దూలేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-ఆగ్రా నేషనల్ హైవేపై  దాదాపు ఏడు, ఎనిమిది వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో వాహనాలన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాహనాల్లో చిక్కుకున్న వారిని చాలా కష్టంగా బయటకు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే సమీప గ్రామ ప్రజలు సహాయక చర్యలు చేపట్టారు.