చిన్నారులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఒకరు మృతి

చిన్నారులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఒకరు మృతి

కరీంనగర్ : ఈ రోజు ఉదయం జిల్లాలోని ఎలగందల గ్రామంలో విషాదం నెలకొంది. ఇంటి ముందు చెట్టు కింద నిద్రిస్తున్న చిన్నారులపైకి  ట్రాక్టర్ దూసుకెళ్లింది.  ట్రాక్టర్ రివర్స్ తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కవల పిల్లలైన లక్ష్మీబాయి(7) మృతి చెందగా, రాము(7) తీవ్రంగా గాయపడ్డాడు. మృతురాలి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. చికిత్స నిమిత్తం రామును ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొన్నారు.  కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.