
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బర్త్డే వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ కేక్ కట్చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభిమానులు, కార్యకర్తలు 720 మంది రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకు న్నారు. ఎమ్మెల్యే కుటుంబంతో కలిసి తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.