
నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఓసీపీ గనిలో రూ.5.26 కోట్ల విలువైన 75 టన్నుల హైడ్రాలిక్ క్రేన్ ను ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. దీని సహాయంతో షావల్స్, డంపర్లు, సీహెచ్పీ రిపేర్లు, వివిధ గనుల విభాగాల్లో భారీ యంత్రాలు, యంత్ర పరికరాలను రవాణా చేయవచ్చని చెప్పారు. బెల్లంపల్లి రీజియన్ జీఎం(క్వాలిటీ) సుశాంత్ సాహూ, ఎస్వోటూ జీఎం సత్యనారాయణ, ఏఐటీయూసీ నాయకుడు బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు కె. వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని జీఎం శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం తన ఆఫీస్లో జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ లో మాట్లాడారు. నాయకులు బాజీ సైదా, కొమురయ్య, కిషన్ రావు, ప్రసాద్ రెడ్డి, గొర్రె నర్సయ్య, అడ్డు శ్రీనివాస్ తదితరులున్నారు.