శ్రీరాంపూర్ ఓసీపీ గనిలో హైడ్రాలిక్ క్రేన్ ​ప్రారంభం

 శ్రీరాంపూర్ ఓసీపీ గనిలో హైడ్రాలిక్ క్రేన్ ​ప్రారంభం

నస్పూర్, వెలుగు:  శ్రీరాంపూర్ ఓసీపీ గనిలో రూ.5.26 కోట్ల విలువైన 75 టన్నుల హైడ్రాలిక్ క్రేన్ ను ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్  శుక్రవారం ప్రారంభించారు.  దీని సహాయంతో షావల్స్, డంపర్లు, సీహెచ్​పీ రిపేర్లు, వివిధ గనుల విభాగాల్లో భారీ యంత్రాలు, యంత్ర పరికరాలను రవాణా చేయవచ్చని చెప్పారు.  బెల్లంపల్లి రీజియన్ జీఎం(క్వాలిటీ)  సుశాంత్ సాహూ, ఎస్​వోటూ జీఎం  సత్యనారాయణ, ఏఐటీయూసీ నాయకుడు బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు కె. వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని జీఎం శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం తన ఆఫీస్​లో జరిగిన  స్ట్రక్చర్ మీటింగ్ లో మాట్లాడారు.  నాయకులు  బాజీ సైదా,  కొమురయ్య, కిషన్ రావు,  ప్రసాద్ రెడ్డి,  గొర్రె నర్సయ్య, అడ్డు శ్రీనివాస్  తదితరులున్నారు.