రాష్ట్రంలో కొత్తగా 7వేల 994 కేసులు..58 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 7వేల 994 కేసులు..58 మంది మృతి

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 7వేల 994 పాజిటివ్ కేసులు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో.. 58మంది చనిపోవటం ఆందోళన కలిగిస్తోంది. యాక్టివ్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 76వేల మందికి పైగా కరోనాతో బాధ పడుతున్నారు. GHMC పరిధిలో నిన్న అత్యధికంగా 16వందల 30 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు గ్రేటర్ లో ఇవే అత్యధిక కేసులు. జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి భయంకరంగా ఉంది. మల్కాజ్ గిరి జిల్లాలో 615 పాజిటివ్ కేసులు వచ్చాయి. రంగారెడ్డిలో 558, నల్గొండలో 424, సంగారెడ్డిలో 337, నిజామాబాద్ జిల్లాలో 301 కేసులు రికార్డయ్యాయి. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య  4లక్షల 27వేలు 960కు చేరింది. మరణాల సంఖ్య 2 వేల 208కు పెరిగిందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.