ముంబై: మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.879 కోట్ల విలువ చేసే సుమారు 300 కిలోల హెరాయిన్ ను సీజ్ చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఆదివారం వెల్లడించింది. జిప్సమ్ స్టోన్, ఫేస్ పౌడర్ అన్న పేరుతో అఫ్ఘానిస్థాన్ నుంచి ఇరాన్ మీదుగా స్మగ్లింగ్ చేస్తుండగా రాయగడ్ పోర్టులో గురువారం పట్టుకున్నట్లు వివరించింది. ఇటీవల కాలంలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం ఇదేనని డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఆ డ్రగ్స్ పార్శిల్ కు సంబంధించిన ఇపోర్ట్స్, ఎక్స్ పోర్ట్స్ కోడ్ పంజాబ్ కు చెందిన ప్రభుజోత్ సింగ్ అనే వ్యక్తి పేరుతో ఉందని చెప్పారు. దీంతో అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గత ఏడాది నుంచి జిప్సమ్, ఫేస్ పౌడర్ లను అతడు ఇపోర్ట్ చేసుకుంటున్నాడని పేర్కొన్నారు. దీనిపై లోతుగా ఎంక్వైరీ చేయాల్సి ఉందని, దీని వెనుక ఎవరున్నారు? డ్రగ్స్ నెట్ వర్క్ ఎవరితో లింక్ అయ్యి ఉందో తేల్చాల్సి ఉందని తెలిపారు. కాగా, గత ఏడాది ఆగస్టులో ఇదే పోర్టులో రూ. వెయ్యి కోట్ల విలువైన హెరాయిన్ ను ఆయుర్వేదిక్ మెడిసిన్ పేరుతో ఇంపోర్ట్ అవుతుండగా డీఆర్ఐ సీజ్ చేసింది. ఆ డ్రగ్స్ కూడా అఫ్ఘానిస్థాన్ నుంచే వచ్చాయి.
ఫేస్ పౌడర్ పేరుతో డ్రగ్స్ స్మగ్లింగ్: రూ.879 కోట్ల హెరాయిన్ సీజ్
- క్రైమ్
- July 5, 2021
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు