
ఆహారం, నీటి కోసం వన్య మృగాలు గ్రామాలవైపు వస్తున్నాయి. నీళ్ల కోసం బోరు బావుల వద్దకు వచ్చి ఇబ్బందులకు గురవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అడవి నుంచి తప్పిపోయిన ఎలుగుబంటి బావిలో పడిన ఘటన కలకలం రేపింది. శనివారం (మే 31) అడవి నుంచి తప్పిపోయిన ఎలుగుబంటి బోథ్ మండలంలో వ్యవసాయ క్షేత్రంలోని బావిలో పడింది.
అడవి నుండి తప్పిబోయిన ఎలుగుబంటి నీటి కోసం వెళ్లి ప్రమావశాత్తు బావిలో పడింది. బావిలో ఎలుగు కొట్టుమిట్టాడుతూ శబ్దాలు చేస్తుండటం రైతులు గమనించారు. ఈ ఘటన గురించి తెలియడంతో స్థానికులు వందల సంఖ్యలో బావి దగ్గరకు చేరుకున్నారు.
ఎలుగుబంటిని రక్షించేందుకు స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు జేసీబీ సహాయంతో ఎలుగుబంటి ని బయటకు తీశారు. అధికారులు వేసిన నిచ్చెనపై ఎలుగు బంటి కూర్చోగా.. నిదానంగా పైకి తీసి కిందికి దించారు. దీంతో అప్పటి వరకూ బోరుబావిలో ఉండి అదిరిపోయిన ఎలుగు.. బయటకు తీసిన వెంటనే పరగు లంకించి అడవి మార్గంలోకి వెళ్లిపోయింది.
Bear fell into a well in Adilabad district Bodh Mandal.. Telangana pic.twitter.com/vVz94tPluL
— Mahadev Narumalla✍ (@Kurmimahadev) May 31, 2025