బీజేపీ నేత కుటుంబం దారుణ హత్య

బీజేపీ నేత కుటుంబం దారుణ హత్య

ఝార్ఖండ్ లో ఓ బీజేపీ నేత కుటుంబం దారుణ హత్యకు గురైంది. కుంతిలోని హెతెగొవా గ్రామానికి చెందిన మాగో ముండా అనే బీజేపీ లీడర్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆయనతో పాటు అతని భార్య,కుమారుడిని కూడా కాల్చి చంపారు. సోమవారం రాత్రి ఆయన ఇంటి దగ్గరే ఈ దారుణం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.