పోలింగ్​ ఒక రోజు ముందు.. బెంగళూరును ముంచెత్తిన వరద

పోలింగ్​ ఒక రోజు ముందు.. బెంగళూరును ముంచెత్తిన వరద

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​కి ఒక రోజే మిగిలి ఉండగా, సోమవారం కురిసిన వర్షాలు నగరాన్ని ముంచెత్తాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. దక్షిణ బెంగళూరులోని హోసకెరెహళ్లి సరస్సు వెనక ఉన్న పుష్పగిరి లేఅవుట్​ మునిగిపోయింది. బీబీఎంపీ మురుగు కాలువ విభాగం చేపట్టిన అసంపూర్తి పనులే భారీ వరదలకు దారి తీశాయి. కొన్ని నెలల క్రితమే లేఅవుట్​కు సమీపంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్​ మధ్యలో వదిలేశాడు. దీంతో వర్షానికి ఆ ప్రాంతం మొత్తం వరదమయమైంది.  తర్వాత అధికారులు వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.  సంబంధిత కాంట్రాక్టర్​ తో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. లేఅవుట్​తో పాటు, దత్తాత్రేయ దేవాలయం వెనక ఉన్న రెండు ఇళ్లు, గిరినగర్​లోని మరో ఇంట్లోకి వర్షపు నీరు చేరింది.

మరి కొన్ని ప్రాంతాల్లో..
లాల్‌బాగ్ సమీపంలోని కదిరేనహళ్లి మెయిన్ రోడ్డు , నమ్మ మెట్రో స్టేషన్ బయట నీరు నిలిచిపోయింది . శాంతినగర్‌లో చెట్టు కొమ్మ రోడ్డుపై పడటంతో ట్రాఫిక్‌ ఆగిపోయింది. బసవనగుడిలోని శ్రీనివాసనగర్‌లో చెట్టు కూలింది.