ఎంజీఎంలో కార్మికుల ధర్నా

ఎంజీఎంలో కార్మికుల ధర్నా

వరంగల్​సిటీ, వెలుగు: వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో గురువారం ధర్నా నిర్వహించారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్​, పేషెంట్​ కేర్​ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 300 మంది ఇందులో పాల్గొన్నారు. సుమారు అరగంటపాటు జరిగిన ఈ ధర్నాలో కాంట్రాక్టర్​కు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

లేబర్​ చట్టం ప్రకారం రూ. 15600 వేతనం ఇవ్వాల్సి ఉండగా..  కేవలం రూ. 11000  మాత్రమే ఇస్తున్నారని, పీఎఫ్​, ఈఎస్​ఐ జాడ లేదన్నారు. మా జీతాలను కాంట్రాక్టర్​ జేబులో వేసుకుంటూ కోట్లు దోచుకుంటున్నారని కార్మికులు విమర్శించారు. 15 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ స్పందించలేదని,  అందుకే  అరగంటపాటు ధర్నా చేసినట్లు కార్మికులు తెలిపారు.