పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి యునాని దవాఖానలో కాంపౌండర్ చంద్రశేఖర్ మద్యం సేవించి కుర్చీలో కూర్చుని సిగరెట్టు కాల్చుతూ విధులు నిర్వహించాడు. బార్ మాదిరిగా దవాఖానలో ఆయన ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు మీడియాకు చిక్కాయి. ఈ హాస్పిటల్లో ముగ్గురు సిబ్బంది ఉన్నా.. ఆయన ఒక్కడే డ్యూటీలో ఉంటాడని సిబ్బంది తెలిపారు.
