MI vs RR: గ్రౌండ్‌లోకి అభిమాని.. భయంతో పరుగులు పెట్టిన రోహిత్

 MI vs RR: గ్రౌండ్‌లోకి అభిమాని.. భయంతో పరుగులు పెట్టిన రోహిత్

స్టార్ క్రికెటర్లకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉండడం మామూలే. వారు ఫేవరేట్ ప్లేయర్ కోసం స్టేడియంలోకి రావడమే కాదు.. అవసరమైతే గ్రౌండ్ లోకి దూసుకొని వచ్చేస్తారు. టీమిండియాలో ధోనీ, కోహ్లీ విషయంలో ఈ సీన్ చాలా సార్లు రిపీటైంది. తాజాగా రోహిత్ శర్మను చూడడానికి ఒక అభిమాని గ్రౌండ్ లోకి దూసుకొచ్చేశాడు. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా..అతన్ని చూసి హిట్ మ్యాన్ భయపడటం హైలెట్ గా మారింది. 

ఐపీఎల్ లో భాగంగా నిన్న (ఏప్రిల్ 1) రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ ఇన్నింగ్స్ లో ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. రోహిత్ శర్మను హగ్ చేసుకోవడానికి వాంఖడే స్టేడియంలో ఒక అభిమాని సెక్యూరిటీని ధాటి గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. అప్పటికే రోహిత్ ఫీల్డింగ్ సెట్ చేసే పనిలో ఉండడంతో వెనక నుంచి స‌డెన్ గా అభిమాని పరిగెత్తుకు రావడంతో ఉలిక్కిప‌డి భ‌య‌ప‌డ్డాడు. అతన్ని తప్పించుకోవడానికి రెండడుగులు పరిగెత్తాడు. అయితే ఎట్టకేలకు ఆ అభిమాని రోహిత్ తో పాటు, ఇషాన్ కిషన్ దగ్గర హగ్ తీసుకొన్న తర్వాత సెక్యూరిటీ అతన్ని పంపించేశారు. 

Also read : మ్యాచ్ మధ్యలోనే వైదొలిగిన శ్రీలంక క్రికెటర్.. ఏమైందంటే..?

పవర్ ప్లే సమయంలో అభిమాని గ్రౌండ్ లోకి దూసుకురావ‌డంతో రాజస్థాన్ ఛేజింగ్ సమయంలో ఆటకు కొన్ని నిమిషాలు బ్రేక్ పడింది. ఈ సీజన్ లోకి అభిమాని గౌండ్ లోకి రావడం ఇదే తొలిసారి కాదు. అంత‌కుముందు గత వారం బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో పంజాబ్ తో జరిగిన ఐపీఎల్ 2024 మ్యాచ్ లో విరాట్ కోహ్లీని కలవడానికి, పలకరించడానికి ఒక అభిమాని సెక్యూరిటీ నుంచి తప్పించుకుని మైదానంలోకి దూకాడు. ఇక ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో విఫలమైన ముంబై ఇండియన్స్.. రాజస్థాన్ చేతిలో 6 తేడాతో ఘోరంగా ఓడింది.