వర్ని, వెలుగు: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో కౌలు రైతు చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం సిద్దాపూర్కు చెందిన సఖియా(52) జలాల్పూర్ శివారులో భూమిని కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం సఖియా పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. బోర్ మోటర్ స్టార్ట్ కాకపోవడంతో సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లైన్ బంద్చేసేందుకు వెళ్లి కరెంట్ షాక్కు గురయ్యాడు. కౌలు రైతు మృతితో సిద్దాపూర్ లో విషాదం నెలకొంది. మృతుడికి కూతురు, కొడుకు ఉన్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
