వనపర్తి రైతుకు మిలియనీర్ ఫార్మర్ అవార్డు

వనపర్తి రైతుకు మిలియనీర్ ఫార్మర్ అవార్డు

వనపర్తి, వెలుగు: పర్యావరణానికి ప్రమాదం లేకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా మారిన వనపర్తి కి చెందిన రైతు సి. రవి సాగర్ కు గురువారం మిలియనీర్ ఫార్మర్ అవార్డ్ 2023 ను ప్రదానం చేశారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏర్ ), కృషి జాగరణ్ సంస్థల  తరపున డిశంబర్ 6 న దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభం అయిన ఐసీఏఆర్ సదస్సులో ఆయనకు ఈ అవార్డు అందించారు.

గుజరాత్ గవర్నర్  ఆచార్య దేవారత్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి  సదాశివ ఈ సదస్సులో  రైతు రవి సాగర్ కు మిలియనీర్ ఫార్మర్ అవార్డ్ 2023 ను ప్రదానం చేశారు. ఈ అవార్డ్ కు తన పేరును కేవీకే శాస్త్రవేత్తలు  పంపారని రైతు రవికుమార్ చెప్పారు. ప్రకృతి వ్యవసాయం,  విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో భాగంగా ఈ అవార్డును అందుకున్నట్లు చెప్పారు.