కౌడిపల్లి, వెలుగు: పొలంలో కరెంట్ షాక్తో మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటలో ఓ రైతు చనిపోయాడు. గ్రామానికి చెందిన నీలం లక్ష్మీనారాయణ(38) మంగళవారం సాయంత్రం తన పొలంలో పనులు చేస్తుండగా, పొలంలో ఉన్న 11 కేవీ ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
