- అమెరికాలోని ఓహియోలో ఘోరం.. నిందితుడు అరెస్ట్
ఒహియో: అమెరికాలోని ఒహియోలో ఓ వ్యక్తి తన ముగ్గురు కొడుకులను వరుసలో నిలబెట్టి రైఫిల్ తో కాల్చి చంపాడు. రైఫిల్తో డోర్మాన్ తమ కుమారులను చంపినట్లు అంగీకరించాడని క్లెర్మాంట్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకటించింది. 32ఏళ్ల చాడ్ డోర్ మాన్ కూతురు తమ తండ్రి అందరినీ చంపేస్తున్నాడని అరుస్తూ వీధిలోకి పరిగెత్తడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. మూడు, నాలుగు, ఏడు సంవత్సరాల వయస్సు గల తన ముగ్గురు కుమారులను డోర్మాన్ వరుసలో ఉంచి వారిపై కాల్పులు జరిపాడు.
కాగా, డోర్ మాన్ నుంచి తప్పించుకున్న అతడి భార్య, కుమార్తె ఇంటి నుంచి బయటకువచ్చి అరవడంతో స్థానిక డ్రైవర్ ఒకరు 911కు ఫోన్సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పిల్లలను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఘటనా స్థలంలోనే పిల్లలు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. సంఘటన తర్వాత తన నివాసం వెలుపల కూర్చుని ఉన్న డోర్మాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కుమారులను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. హత్యలకు కారణాలు ఇంకా తెలియలేదని అధికారులు ప్రకటించారు.