కారులో మంటలు.. డ్రైవర్​ అలర్ట్​తో తప్పిన ప్రమాదం

కారులో మంటలు.. డ్రైవర్​ అలర్ట్​తో తప్పిన ప్రమాదం

హైటెక్స్​ నుంచి జేఎన్​టీయూ వెళ్లే  దారిలో అర్ధరాత్రి ఓ కారులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. మాదాపూర్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్​ టవర్స్​ నుంచి జేఎన్​టీయూ వైపు వెళ్తున్న (టీఎస్​10 ఈఈ 3363) ఐ 20 కారులో జూన్​ 9న రాత్రి 10.30 గంటలకు యశోదా హాస్పిటల్​ రాగానే ఇంజిన్​నుంచి పొగలు వచ్చాయి.

కారు డ్రైవ్​ చేస్తున్న వ్యక్తి గమనించి వెంటనే కిందకు దిగాడు. ఈ క్రమంలో మంటలు కారు మొత్తం వ్యాపించాయి. ఫైర్​ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. కారు యజమాని వివరాలు ఇంకా తెలియరాలేదు.