అపార్ట్‌మెంట్‌లో మంటలు.. కాలిబూడిదైన ఇంట్లోని వస్తువులు, ఫర్నిచర్

అపార్ట్‌మెంట్‌లో మంటలు.. కాలిబూడిదైన ఇంట్లోని వస్తువులు, ఫర్నిచర్

రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాసం అపార్ట్‌మెంట్‌లో గురువారం (అక్టోబర్​ 26న) అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు 5వ ఫ్లోర్ లోని ఓ ప్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఇంట్లోని వాళ్లు బయటకు పరుగులు తీశారు. విషయాన్ని గ్రహించిన అపార్ట్ మెంట్​వాసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, మణికొండ మున్సిపాలిటీ సమాచారం అందించారు. 

విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి.. మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు చెప్పారు. షాట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్లాట్‌లో మంటలు చెలరేగాయని ప్రాథమికంగా గుర్తించారు. శ్రీనివాసం అపార్ట్‌మెంట్‌లో మొత్తం 54 కుటుంబాలు ఉంటున్నాయి. 

ALSO READ :- 4 నెలల్లో.. రూ.4 కోట్లు పోయాయి.. వృద్ధులను పీడించి మరీ దోచుకున్నారు సైబర్ కేటుగాళ్లు..